అన్నవరం సత్యదేవుని ఆవిర్భావ వేడుకలు…

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై వెలసిన శ్రీవీరవేంకట సత్యన్నారాయణస్వామివారి 129వ ఆవిర్భావ వేడుకలు శ్రావణమాసం తొలి శుక్రవారం ఫల, పుష్ప సేవను అత్యంత వైభవంగా నిర్వహించడానికి నిత్యకల్యాణ మండపాన్ని అనేక రకాల పండ్లు, పుష్పాలతో సుందరంగా ముస్తాబుచేస్తున్నారు. స్వామిదర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది.

సీఎంఆర్‌ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ సుమారు రూ. 42 లక్షల వ్యయంతో బంగారు తాపడం చేయించారు. అంతరాలయం, బయట గోడలు, గుమ్మాలకు పలువురు దాతల సహకారంతో ఇప్పటికే బంగారు తాపడం చేయించారు. పైకప్పునకు కూడా బంగారు తాపడం చేశారు.