ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం నియామక ర్యాలీ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 13 జిల్లాలవారు (తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం) దీనికి అర్హులు.
అర్హత: ఇంటర్మీడియట్, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: అక్టోబర్ 1, 2019 నాటికి 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా.
ర్యాలీ నిర్వహణ తేది: 7 అక్టోబరు 2019 నుంచి 17 అక్టోబరు 2019 వరకు.
ర్యాలీ ప్రదేశం: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్టేడియం, కరీంనగర్.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 22 సెప్టెంబరు 2019
వెబ్సైట్: joinindianarmy.nic.in