తెలుగు జాతికి జగన్‌ ద్రోహం చేశారు

తమ ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణాలు మొదలు పెట్టినా, తాను నిమిత్త మాత్రుడినేనని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇవాళ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమరావతి ప్రస్తుత పరిస్థితిపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్‌ చేసిన ద్రోహం వల్ల రాజదాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలి పోయిందని ఆయన అన్నారు. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోయాయని అన్నారు. ఏం చూసి రావాలని పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారని చెప్పారు. ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంగా మారాడని,ప్రజల పట్ల దురదృష్టంగా దాపురించాడని పరోక్షంగా జగన్‌ గురించిఅన్నారు. తూర్పున ఉన్న సన్ రైజింగ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చంద్రబాబు చెప్పారు. బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే అభివృద్ధికి నాంది పలకాలని, ఇది యావత్ రాష్ట్ర ప్రజల రాజధాని అని ఆయన చెప్పారు. ప్రతీ తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలి చెప్పుకోవాలని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని చంద్రబాబు తెలిపారు. కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని చంద్రబాబు తెలిపారు.

Related Articles