రెంటాల గోపాలకృష్ణ శత జయంతి సభ రేపు

ప్రముఖ రచయిత, జర్నలిస్టు రెంటాల గోపాలకృష్ణ శతజయంతి ప్రారంభ సభ ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కానుంది. దోమల్‌గుడాలో ఉన్న హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌‌లో ఉదయం 10.30గం.లకు ఈ కార్యక్రమం జరగనుంది. సభకు అధ్యక్షులుగా సాహితీ, రాజకీయ విమర్శకులు తెలకపల్లి రవి వ్యవహరించనున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‌, ప్రముఖ దర్శకుడు బి. నరసింగరావు, కవి అఫ్సర్‌, రెంటాల సంస్మరణోత్సవ సంఘం అధ్యక్షులు కె.పి. అశోక్‌ కుమార్‌, ఆదిత్య కొర్రపాటి తదితరులు సభకు హాజరుకానున్నారు. ఛాయా రిసోర్సెస్ సెంటర్, రెంటాల స్మరణోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.