భూముల వేలంతో 11వేల కోట్ల సమీకరణ

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ భూముల అమ్మకానికి తెరలేపింది. 3 దశల్లో వేలం నిర్వహించి 11వేల కోట్లు సమీకరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. . రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమావేశమై ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. భూముల మార్కెట్‌ ధరలు పెంచాలని, తొలుత హెచ్‌ఎండీఏ పరిధిలో పెంపును వర్తింపజేయాలని, ఆర్థిక వన రుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసం ఘం ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ప్రస్తు తం అమల్లో ఉన్న మార్కెట్‌ ధరలను ఉమ్మడి రాష్ట్ర పాలనలో చాలా కాలం కిందట ఖరారు చేశారని, ప్రస్తుత వాస్తవ మార్కెట్‌ ధరలు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడుతోంది. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ విధించడం తో రాష్ట్ర ఆదాయానికి భారీ గండి పడిన నేపథ్యంలో.. ఈ ఏడాది భూముల అమ్మకాల ద్వారా అదనంగా రూ.11 వేల కోట్లను సమీకరించాలనే నిర్ణయానికి ఉప సంఘం వచ్చినట్టు తెలిసింది.