వివేకా హత్య: సునీల్‌ యాదవ్‌ అరెస్ట్‌

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో పులవెందులకు చెందిన సునీల్‌ యాదవ్‌ను గోవాలో సీబీఐ అరెస్ట్‌ చేసింది. వివేకా హత్య కేసులో సునీల్‌ పాత్ర ఉందని సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం లాంఛనాలు పూర్తి చేస్తున్నారని, వెంటనే అతన్ని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుస్తారని సమాచారం. ప్రస్తుతం సునీల్‌ యాదవ్‌ను కడపకు తరలిస్తున్నారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని, అయినా అంగీకరించాల్సిందిగా సీబీఐ తనపై ఒత్తిడి తెస్తోందని ఆయన ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హత్యను అంగీకరించాలని తనపై థర్ద్‌ డిగ్రీ ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.