Tirumala: వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శన కోటా విడుద‌ల‌

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ శుభ‌వార్త తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న భ‌క్తుల‌కు ద‌ర్శన కోటా టికెట్లు ఇవాళ ఉద‌యం 9 గంట‌ల‌కు విడుద‌ల కానున్నాయి. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వ‌ర‌కు సంబంధించిన టోకెన్ల‌ను టీటీడీ విడుద‌ల చేయ‌నుంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ఉచిత ద‌ర్శన టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ అధికారులు సూచించారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 71434 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.