తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చలేదు

తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చలేదని విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. తుమ్మలపల్లి, క్షేత్రయ్య పేరు మార్పుపై మీడియాలో వచ్చిన కథనాలపై వివరణ ఇచ్చారు. పేరు మార్చారన్నది వాస్తవం కాదని పేర్కొన్నారు. 2021 డిసెంబరులో కొన్ని పునరుద్ధరణ పనులు చేపట్టిన నేపథ్యంలో కేవలం సాంస్కృతిక కార్యక్రమాల కోసమే హాలు ఉద్దేశించబడిందన్న విషయాన్ని తెలియచేసేందుకు గ్లోసైన్‌ బోర్డులో ‘కళాక్షేత్రం’ పేరును పెట్టామని తెలిపారు. ‘తుమ్మలపల్లివారి క్షేత్ర య్య కళాక్షేత్రం’ పేరుతో బోర్డుని త్వరలో ఆవిష్కరిస్తామని వెల్లడించారు.