కర్ణాటక బీజేపీ చీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిప్పుసుల్తాన్‌ను ప్రేమించే వారు కర్ణాటక రాష్ట్రంలో ఉండవద్దని నళిన్ కుమార్ కటీల్ కోరారు. కర్ణాటక రాష్ట్రం రాముడు, హనుమాన్ ఆరాధకులకు మాత్రమేనని కటీల్ వ్యాఖ్యానించారు. ‘రాముడు, హనుమాన్‌లకు ఓటు వేయడం ద్వారా టిప్పు సుల్తాన్ వారసులను తరిమికొట్టండి’ అని బీజేపీ చీఫ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టిప్పుసుల్తాన్ వర్సెస్ సావర్కర్‌ల మధ్య పోరు అని నళిన్ కుమార్ పోల్చారు. అంతకుముందు రోడ్డు, మురుగునీటి సమస్యలపై దృష్టి పెట్టకుండా లవ్ జిహాద్‌పై దృష్టి పెట్టాలని నళిన్ కటీల్ బీజేపీ కార్యకర్తలను కోరారు. తాము టిప్పుసుల్తాన్ వారసులు కాదని, రాముడు, హనుమంతుడి భక్తులమని, టిప్పుసుల్తాన్ వారసులను ఇంటికి పంపిస్తామని బీజేపీ చీఫ్ చెప్పారు.