గాయంతో వార్నర్‌ ఔట్‌

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్‌లు చేజార్చుకున్న ఆసీస్‌ జట్టుకు మరో షాక్ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ దూరమయ్యాడు. గాయం కారణంగా భారత్‌తో మిగిలిన రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉండటం లేదు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్‌ మోచేతికి గాయమైంది. ఈ కారణంగా మెరుగైన చికిత్స కోసం స్వదేశానికి బయల్దేరి వెళ్లాడు. అయితే టీమ్‌ఇండియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం వార్నర్‌ జట్టుతో కలిసే అవకాశముందని క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే హాజిల్‌వుడ్‌ జట్టుకు దూరం కాగా, తాజాగా వార్నర్‌ కూడా అదే బాట పట్టడంతో ఆసీస్‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ వచ్చే నెల 1న ఇండోర్‌లో మొదలవుతుంది.