బళ్లారి ఎక్స్‌ప్రెస్‌కు బాంబ్ బెదిరింపు కాల్..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న బళ్ళారి ఎక్స్ ప్రెస్‌లో బాంబు పెట్టామని ఒక గుర్తు తెలియని వ్యక్తి పొలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. అంతే..వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసులు.. సమాచారాన్ని సికింద్రాబాద్ ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు అందించారు. హుటాహుటిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు డాగ్ స్క్వాడ్ సహా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు బళ్ళారి రైలులో తనిఖీలు చేయగా.. బాంబు లేదని.. కేవలం బెదిరింపు కాలేనని తేడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందని కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇంకా తెలియారాలేదు.