‘వందే భారత్‌’పై మళ్లీ రాళ్లదాడి

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. మైసూర్‌- చెన్నై మధ్య నడిచే రైలుపై దుండగులు రాళ్లు విసిరారు. కేఆర్ పురం, బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ మధ్య శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రెండు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. రాళ్లదాడిపై కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటకలో కొందరు కావాలనే అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి బుల్‌డోజర్ ట్రీట్‌మెంట్ సరైందని అభిప్రాయపడ్డారు.

Related Articles