టీ20 క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 10 పరుగులకే ఆలౌట్ అయింది. 11 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన మరో జట్టు రెండు బంతుల్లోనే మ్యాచ్ ముగించింది. స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు పది పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో, ఈ ఫార్మాట్లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. పొట్టి క్రికెట్లో ఇప్పటివరకూ అత్యల్ప స్కోర్ సిడ్నీ థండర్స్ పేరు మీద ఉంది. బిగ్బాష్ లీగ్లో సిడ్నీ థండర్స్ జట్టు 15 పరుగులకే కుప్పకూలింది. అడిలైడ్ స్ట్రయికర్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. 11 పరుగుల టార్గెట్ను స్పెయిన్ జట్టు రెండు బంతుల్లోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్ అవైస్ అహ్మద్ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దాంతో, టీ20ల్లో రెండు బంతుల్లోనే విజయం సాధించిన తొలి జట్టుగా స్పెయిన్ రికార్డు క్రియేట్ చేసింది. అతిఫ్ మహమూద్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.