మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం

శంషాబాద్‌లో ఓ కానిస్టేబుల్ పీకల దాకా మద్యం తాగి వీరంగం సృష్టించాడు. ఆర్‌జీఐ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న రాజమల్లయ్య మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కోత్వాల్‌గూడ ఔటర్ రింగ్‌ రోడ్డు సర్వీసు రోడ్డులో తన కారును రోడ్డుకు అడ్డంగా పెట్టాడు. ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలను ఆపి డబ్బులు వసూలుకు కూడా పాల్పడ్డాడు. గచ్చిబౌలి నుంచి వస్తున్న అశ్విన్ రెడ్డి దంపతులను కారు ఆపి అసభ్యకరంగా మాట్లాడడంతో వారు 100 ఫోనే చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్‌జీఐ పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.