హైదరాబాద్‌లో భారీ చోరీ కలకలం..

హైదరాబాద్‌లో భారీ చోరీ చోటుచేసుకుంది. హయత్‌నగర్‌లో ఓ పోలీస్ అధికారి ఇంట్లో భారీ చోరీ కలకలం సృష్టిస్తోంది. పసుమ ములలో ఓ పోలీస్ అధికారి ఇంట్లోనే దొంగనతం జరగడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శివ నారాయణ అనే పోలీస్ అధికారి ఇంట్లో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న మూడు లక్షల నగదు, ఐదు తులాల బంగారాన్ని అపహరించుకుపోయారు. శివ నారాయణ తన ఫ్యామిలీతో కలిసి వేరే ఊరు వెళ్లాడు. ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత తాళం పగలగొట్టి ఉంది. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు అర్థమైంది. డబ్బులు, బంగారం ఆభరణాలను చోరీ చేసి తీసుకెళ్లినట్లు గుర్తించారు. శివ నారాయణ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి మొత్తాన్ని పరిశీలించారు. ఎంత సొమ్ము చోరీకి గురైందనే వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.