పుష్ప-2లో సాయిపల్లవి?

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ ప్రతినాయ‌కుడి పాత్రలో న‌టించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో సాయిపల్లవిని తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఓ గిరిజన అమ్మాయి పాత్ర కోసం సాయిపల్లవిని చిత్రబృందం సంప్రదించిగా అందుకు సాయిపల్లవి కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇందుకోసం సాయిపల్లవి 10రోజులు కాల్షీట్లు కూడా ఇచ్చిందట. ఈ క్రమంలో ట్విట్టర్‌లో సాయిపల్లవి, పుష్ప ది రూల్‌ ట్రెండింగ్‌లోకి వచ్చాయి.