కావాలనే మమ్మల్ని టార్గెట్‌ చేస్తున్నారు

సీఎం జగన్ రాష్ట్రంలో కొందరిని టార్గెట్‌గా చేసుకుని కేసులు పెడుతున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. హద్దు మీరి పరిపాలన జరుగుతోందని, పార్టీలో చేరమని.. అలాగైతే కేసులు ఏమీ ఉండవని అంటున్నారని ఆయన అన్నారు. సీఎం చెప్పినట్లు వినకపోతే సీఎస్‌ను బదిలీ చేసినట్లుగా తమకు కూడా జరుగుతుందని అధికారులు భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక్క దివాకర్‌ ట్రావెల్సే నిబంధనలు అతిక్రమించిందా?, మిగిలిన వాళ్ల బస్సులు ఎన్ని సీజ్‌ చేశారు? అని ప్రశ్నించారు.