సీబీఐ అంటూ… సీఎం సోదరుడి కిడ్నాప్‌

ఆటబొమ్మ తుపాకులతో సీబీఐ అధికారులమని చెప్పి సీఎం సోదరుడిని కిడ్నాప్‌ చేసిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు.ఈ ఘటన శుక్రవారం జరిగింది. కోల్‌కతాలో ఓ అద్దె ఇంట్లో మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ సోదరుడు తోంగ్‌బ్రామ్‌ లుఖాయి సింగ్‌ ఉంటారు. సీబీఐ అధికారులమంటూ అయిదుగురు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి… లుఖాయి సింగ్‌ను, ఆయన సహచరుడిని కిడ్నాప్ చేశారు. రూ. 15 లక్షలు డిమాండ్‌ చేశారు. కిడ్నాప్‌ విషయాన్ని లుఖాయి సింగ్‌ భార్య పోలీసులు తెలిపారు. పోలీసులు కొన్ని గంటల్లోనే దుండగులను అరెస్ట్‌ చేశారు. వీరిలో ఇద్దరు మణిపూర్‌ వాసులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు వాహనాలను, బొమ్మ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

Related Articles