కత్తి మహేష్‌ మృతిపై విచారణ జరపాలి

సినీ విమర్శకుడు కత్తి మహేష్ మృతిపై విచారణ జరపాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేస్తున్నారు. నెల్లూరు సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మహేష్‌ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కత్తి మహేష్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కత్తి మహేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ, జగన్ కోసం ప్రచారం చేశారని, అలాంటి వ్యక్తి చనిపోతే సీఎం జగన్ కనీసం సంతాప ప్రకటన కూడా చేయలేదని మందకృష్ణ విమర్శించారు.

నెల్లూరు పోలీసుల విచారణ
కత్తి మహేష్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కొందరు ఆరోపణలు చేస్తుండటంతో… ఈ ఘటనపై నెల్లూరు పోలీసులు విచారణ ప్రారంభించారు.ఈనెల 26వ తేదీన ఇదే జిల్లాలో మహేష్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో కారును నడిపిన డ్రైవర్‌ సురేష్‌ను కూడా పిలిచి విచారిస్తున్నారు.