ఆ సెక్షన్‌ కింద కేసులు పెట్టొద్దు..కేంద్రం

ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ కింద కేసులు పెట్టొద్దని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మీడియాలో పోస్ట్‌ పెడుతున్నవారిపై అనేక రాష్ట్రాల్లో పోలీసులు కేసులు పెడుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సెక్షన్‌ను తాము రద్దు చేశామని చెప్పినా… ఇంకా సెక్షన్‌ కింద కేసులు పెట్టడాన్ని విమర్శించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇచ్చింది.