రిలయన్స్‌ చేతికి న్యూయార్క్‌ హోటల్‌

హాస్పిటాలిటీ రంగంలోకి రిలయన్స్‌ మరింత విస్తరిస్తోంది. కరోనా సమయంలో అనేక కంపెనీలు హాస్పిటాలిటీ రంగం నుంచి వైదొలగుతున్నాయి. అయినకాడికి కంపెనీలను అమ్మేస్తున్నారు. ఇదే అదనుగా రిలయన్స్‌ ఇండస్ట్రీ ఈ రంగంలో ఆస్తులను కొనుగోలు చేస్తోంది. న్యూయార్స్‌లోని ప్రముఖ హోటల్‌ మాండరిన్‌ ఓరియంటల్‌ హోటల్‌ను రూ. 2000 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందులో కంపెనీలో 73.37 శాతం వాటా కొనేందుకు సుమారు రూ. 750 కోట్లు (9.815 డాలర్లు) వెచ్చించనుంది. ఆ కంపెనీకి మరో 11.5 కోట్ల డాలర్ల అప్పు ఉంది. ఆ రుణాన్ని కూడా రిలయన్స్‌ కంపెనీ టేకోవర్‌ చేసింది. అంటే మొత్తం ఈ హోటల్ కోసం దాదాపు రూ. 2000 కోట్లు వెచ్చిస్తోందన్నమాట. న్యూయార్క్‌లోని కొలంబస్‌ పార్క్‌లో ఉన్న హోటల్‌లో 480 రూమ్‌లు, సూట్స్‌ ఉన్నాయి. ప్రముఖ విలాసవంతమైన వారికి ఉద్దేశించిన పలు లగ్జరీ హోటల్స్‌ ఇక్కడ ఉన్నాయి. గత ఏడాది లండన్‌ సమీపంలోని కౌంటీ క్లబ్‌ స్టోక్‌ పార్క్‌ను రిలయన్స్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.