ప్రొద్దుటూరు కోర్టుకు బండ్ల గణేష్‌

చెక్‌ బౌన్స్‌ కేసుకు సంబంధించి సినీ నిర్మాత బండ్ల గణేష్ వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వర్గాలు తెలిపిన మేరకు బండ్ల గణేష్‌పై ప్రొద్దుటూరు కోర్టులో చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. వీటిలో ఒక కేసుకు సంబంధించి బుధవారం ఆయన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. తిరిగి ఈ కేసు విచారణ ఈనెల 22కు వాయిదా పడినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.

Related Articles