ఆర్టీసీ కార్గో ‘పార్శిల్’లో మద్యం బాటిళ్లు..

ఆంధ్రప్రదేశ్‌లోకి పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలించేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషించిన వారిని ఇప్పటివరకూ మీరు చూసుంటారు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకోసం ఏకంగా ఆర్టీసీ కార్గో సర్వీస్, ఇండియన్ రైల్వేలనే ఎంచుకున్నాడు. అధికారులను నివ్వెరపోయేలా చేశాడు. ఆర్టీసీ కార్గో సర్వీసులను ఇలా కూడా వినియోగించుకోవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. చెన్నై నుంచి రైల్లో అక్రమంగా తరలించిన ఆ మద్యం బాటిళ్లను రైల్వే అధికారులెవరూ గుర్తించలేకపోయారు. ఆ తర్వాత వాటిని ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తుండగా.. వాటిలో ఒక బాటిల్ పగిలిపోయింది. మద్యం వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి అధికారులు తనిఖీ చేయగా.. ఈ బండారం బయటపడింది.