కోలీవుడ్ హీరో ధనుష్ కు షాక్…

నిన్న కోలీవుడ్ స్టార్ విజయ్..నేడు మరోస్టార్ ధనుష్… మద్రాస్ హైకోర్టు ఆగ్రహానిికి గురయ్యారు. విదేశాల నుంచి తెచ్చుకున్న లగ్జరీ కారుకు పన్ను మినహాయింపు కోరడంపై.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాన్యులే పన్ను కట్టగా లేనిది, వీఐపీలకు ఏమి ఇబ్బందని ప్రశ్నించింది. అంతేకాకుండా చట్టం ముందు అందరూ సమానులేనని ఉద్ఘాటించింది.

2015లో ధనుష్‌….అత్యంత ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారును కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దానిని దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ …అదే ఏడాదిలో మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

తాజాగా ధనుష్‌ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేసింది. లగ్జరీ కారు కొనుగోలు చేసి.. పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారు? అని ధనుష్‌ని నిలదీసింది. ఇప్పటికే తాను 50 శాతం పన్ను చెల్లించానని మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 9న కట్టేస్తానని ఆయన సమాధానమిచ్చారు. హీరో విజయ్‌కు సైతం ఇటీవల కోర్టు నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైంది. పన్ను కట్టనందుకు విజయ్‌కు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.

Related Articles