నిలిచిపోయిన ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు

కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. సాయన్న నివాసం నుంచి వెస్ట్ మారేడ్‌పల్లిలోని శ్మశానవాటిక వరకూ అంతిమయాత్ర కొనసాగింది. మరికాసేపట్లో అంత్యక్రియలు పూర్తవుతాయనగా.. అనుచరులు అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సాయన్నకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలంటూ మెరుపు ధర్నాకు దిగారు. అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో మంత్రులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Related Articles