ORRపై ప్రమాదం, ముగ్గురు దుర్మరణం

సంగారెడ్డి జిల్లా కొల్లూరు వద్ద ఓఆర్ఆర్ రోడ్డుపై నుంచి సర్వీస్ రోడ్ పక్కన ఉన్న గుడిసెపై లారీ పడిపోయింది. ఈ ప్రమాదంలో గుడిసెలో నిద్రిస్తున్న కుటుంబంలో ముగ్గురూ మృతి చెందారు. అతి వేగం.. నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగింది. లారీ కింద పడి దంపతులతో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. హర్యానా నుంచి చిత్తూరుకు లారీ బియ్యం లోడ్‌తో వెళుతోంది. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నందున అదుపు తప్పి కింద ఉన్న గుడిసె మీద పడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న చెట్లకు నీళ్లు పోసే కార్మికులు బాబు రాథోడ్ ( 48 ) కమలీ భాయ్ (43) రాథోడ్ (23) దుర్మరణం పాలయ్యారు.

Related Articles