మహిళ ప్రాణం తీసిన కారు రేసింగ్‌

అతిగా మద్యం సేవించి మూడు కార్లతో రేసింగ్ పెట్టుకున్న విద్యార్ధులు ఓ మహిళ ప్రాణం తీసిన ఘటన నార్సింగి పోలీస్ స్టేసన్ పరిధిలోని జన్వాడ వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శాంతమ్మ అనే మహిల భర్త నర్సింహులుతో కలిసి స్కూటీపై మంగళవారం సాయంత్రం ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా ఢీ కొనడంతో ఆమె ఎగిరిపడింది. ఆమెకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఐబీఎస్ కళాశాల విద్యార్ధులు అతిగా మద్యం తాగి మూడు కార్లతో ప్రధాన రోడ్డుపై రేసింగ్ పెట్టుకున్నారు. అందులో భాగంగా అతివేగంగా వెళుతున్న ఓ కారు స్కూటీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. శాంతమ్మ భర్త నర్సింహులుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles