రచయిత యండమూరికి తృటిలో తప్పిన ప్రమాదం

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును గోదావరిఖని డిపో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం దెబ్బతిని, టైరు పగిలిపోయింది. కారులో ప్రయాణిస్తున్న యండమూరి, డ్రైవర్.. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. యండమూరి హైదరాబాద్‌ నుంచి కరీంనగర్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Related Articles