నార్సింగి శ్రీచైతన్య గుర్తింపు రద్దు..

ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్యకు కారణమైన నార్సింగి శ్రీచైతన్య కాలేజీపై ఇంటర్‌బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. ఆ కాలేజీ గుర్తింపును రద్దుచేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌ అడ్మిషన్లపై నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థి ఎన్‌ సాత్విక్‌ 6 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొ న్న విషయం తెలిసిందే. దీనిపై సద రు కాలేజీకి ఇంటర్‌బోర్డు నోటీసు జారీచేసింది. విద్యార్థి సాత్విక్‌ సూ సైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. విచారణ నివేదిక, ఎఫ్‌ఐఆర్‌, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కాలేజీ గుర్తింపును రద్దుచేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Related Articles