ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గ్రామానికి చెందిన షేక్ ఫిరోజ్ ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సోమవారం రాత్రి భోజనం చేశాక ఇంట్లో పడుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ఫిరోజ్ నిద్ర లేచి గుండెనొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు వెంటనే అతడిని చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మార్గమధ్యంలోనే ఆ విద్యార్థి చనిపోయినట్టు ధ్రువీకరించారు.