ప్రాణం తీసిన పదోన్నతి

ఉద్యోగంలో చేరిన పాతికేళ్ల తర్వాత లభించిన పదోన్నతి ఓ పోలీసు ప్రాణం తీసింది. ఇటీవల హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన లక్ష్మీనారాయణ అనే కానిస్టేబుల్‌ శిక్షణలో భాగంగా పరేడ్‌ చేస్తూ కుప్పకూలిపోయి ప్రాణం వదిలారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం కథనం ప్రకారం.. కొండాపూర్‌లో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ 1996లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఆయనకు ఈ నెల 6న హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది. ఇందుకు సంబంధించి శిక్షణ కోసం ఆయన రెండు వారాల క్రితం వరంగల్‌ వెళ్లారు. శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం పోలీసు పరేడ్‌ చేస్తుండగా లక్ష్మీనారాయణ కుప్పకూలిపోయారు. తోటి పోలీసులు అయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌ తరలించే ప్రయత్నం చేశారు. కానీ, మార్గమధ్యలోనే లక్ష్మీనారాయణ మృతి చెందారు.

Related Articles