వింత ఆచారం.. హోలీలో పిడిగుద్దులాట.

హోలీ పండుగను పురస్కరించుకొని నిజామాబాద్‌ జిల్లా సాలూరా మండలం హున్సాలో పిడిగుద్దులాట నిర్వహించారు. గ్రామస్థులు రెండు వర్గాలు గా విడిపోయి సాయంత్రం 6.26 నిమిషాలకు హనుమాన్‌ ఆలయం వద్దకు చేరుకున్నారు. అడ్డుగా కట్టిన తాడుకు ఇరువైపులా నిలబడి పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఆట సుమారు 8 నిమిషాల పాటు సాగింది. ఆటను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఆటను నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టం కలుగుతుందని గ్రామస్థులు చెప్తున్నారు. పిడిగుద్దులాట ప్రారంభానికి ముందు గ్రామ శివారులో కుస్తీ పోటీలు నిర్వహించారు.

Related Articles