నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలోని మెడికల్ కాలేజీలో మరో విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్ధి దాసరి హర్ష తన గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ. అయితే విద్యార్థి మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణ తర్వాత విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.

Related Articles