వరుడు ఒక్కరే.. వధువులు ఇద్దరు..!

ఒక అబ్బాయి, ఒకే ముహూర్తంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లాడనున్నాడు. చిత్రమైన ఈ వివాహ వేడుక గురువారం కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో జరగనుంది. ఈ పెళ్లి శుభలేఖ సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఎర్రబోడుకు చెందిన మడివి సత్తిబాబు ఇదే మండలంలోని దోసిల్లపల్లికి చెందిన స్వప్న కుమారి, కున్నాపల్లికి చెందిన సునీతతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపాడు. కొన్నాళ్లకు ఈ విషయం బయటపడటంతో గొడవలు జరిగాయి. అనంతరం మూడు కుటుంబాలకు చెందిన పెద్దలు కూర్చుని మాట్లాడుకొని.. ఆ ఇద్దరు అమ్మాయిలను, సత్తిబాబుకు ఇచ్చి చేయాలని నిర్ణయించారు. కొంతకాలంగా స్వప్న, సునీతతో సత్తిబాబు సహజీవనం చేస్తున్నాడు. ఫలితంగా యువతులకు చెరో సంతానం కలిగినట్లు సమాచారం. గురువారం గిరిజన సంప్రదాయ పద్ధతిలో యువతులతో సత్తిబాబు పెళ్లి ప్రమాణాలు చేయనున్నాడు.

Related Articles