మోసం చేసిన ఐపీఎస్‌ సస్పెన్షన్‌

ట్రెయినీ ఐపీఎస్‌ కొక్కంటి వెంకట మహేశ్వర్‌ రెడ్డిపై కేంద్ర చర్యలు తీసుకుంది. అతన్ని సస్పెండ్‌ చేస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్నాక… భార్య బిరుదుల భావనను మోసం చేసిన కేసులో అతన్ని సస్పెండ్‌ చేసింది. గత నవంబర్‌ 6వ తేదీన భావన సంచలన ఆరోపణలు చేశారు. తనకు జరిగిన అన్యాయం గురించి ఆమె మీడియాకు వెల్లడించారు. తొమ్మిదేళ్లపాటు ప్రేమించిన వ్యక్తి… ఐపీఎస్‌కు ఎంపిక వెంటనే ప్లేటు ఫిరాయించి కులం ప్రస్తావన తెస్తున్నాడని, చిత్రహింసలు పెడుతున్నారని భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహేశ్వర్‌ రెడ్డి తక్కువ కులం దానివి అంటూ అవమానిస్తున్నాడని.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. తన భర్తతో పాటు అతడి మిత్రుడు కూడా తనను వేధించినట్లు పేర్కొన్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ ట్రెయినీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డిపై అతడి భార్య భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Related Articles