కరోనతో యువ జర్నలిస్ట్‌ మృతి

హైదరాబాద్‌లో కరోనాతో జర్నలిస్టులు యుద్ధమే చేస్తున్నారు. అనేక మంది ఇప్పటికే కరోన బారినపడి చికిత్స పొందుతున్నారు. ఇవాళ టీవీ5 ఛానల్‌కు చెందిన క్రైమ్‌ రిపోర్టర్‌ మనోజ్‌ మృతి చెందారు. నాలుగు రోజుల కింద గాంధీ హాస్పిటల్‌లో మనోజ్‌ చేరాడు. ఇవాళ ఉదయం పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఉదయం 8 గంటలకు మనోజ్‌ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మనోజ్‌కు అప్పటికే న్యూమోనియా ఉందని గాంధీ వైద్యులు తెలిపారు.

Related Articles