టోక్యో ఒలింపిక్స్ : పసిడి చేజారింది

యువరెజ్లర్ రవికుమార్ దహియా… భారత్‌కు రెండో రజతాన్ని అందించాడు. 57 కేజీల ఫైనల్‌లో రష్యాకు జావుర్ యుగేవ్‌ చేతిలో ఓడిపోయాడు. దీంతో రవికుమార్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వెచ్చింది. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ మొత్తం అయిదు పతకాలు సాధించగా.. వాటిలో రెండు రజత పతకాలున్నాయి.

మ్యాచ్ ఆరంభంలో ఆధిక్యాన్ని ప్రదర్శించిన రవికుమార్.. దాన్ని చివరి వరకూ నిలుపుకోలేకపోయాడు.రష్యా రెజ్లర్ తిరిగి పుంజుకోవడంతో.. రవికుమార్ కు ఓటమి తప్పలేదు. రష్యా రెజ్లర్ చేతిలో 4-7తో ఓటమి పాలయ్యాడు. ఫైనల్లో ఓడినా, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సాధించాడు రవికుమార్.

Related Articles