కాకినాడలో యాసిడ్ దాడి

కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరంలో దారుణం చోటు చేసుకుంది. మెడికల్ షాపు ఓనర్, వర్కర్‌పై దుండగులు యాసిడ్ దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ప్లాస్టిక్ కవర్లతో నింపిన యాసిడ్‌ను మొహంపై పోయాడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. షాపు మూసి వేసి ఇంటికి వెళ్తున్న సమయంలో దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత రాత్రి మెడకల్ షాపు యజమాని బుజ్జి, అందులో పనిచేసే కుర్రాడు గుణతో కలిసి షాపును మూసివేసి బైక్‌పై ఇంటికి పయనమయ్యాడు. కొద్దిదూరం వెళ్లిన వెంటనే బైక్‌పై వచ్చిన దుండగులు తమతో తెచ్చిన యాసిడ్‌తో బుజ్జిపై దాడి చేశారు. ఒక్కసారిగా యాసిడ్ పడటంతో బుజ్జి హాహాకారాలు చేశాడు. అయితే బైక్‌పై వెనకాల కూర్చున్న గుణపైనే ఎక్కువగా యాసిడ్ పడింది. దీంతో బుజ్జికి స్వల్పగాయాలు కాగా, గుణ తీవ్రంగా గాయపడ్డాడు. షాపును మూసి వేసి మెడిసిన్స్ అమ్మగా వచ్చిన డబ్బుతో తరుచూ ఇదే మార్గంలో మెడికల్ షాపు యజమాని ఇంటికి వెళ్తుంటాడు. దీన్ని గమనించిన వ్యక్తులు డబ్బుల కోసం ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Related Articles