చిక్కుల్లో ఎమ్మెల్సీ కవిత భర్త..?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనకు ఈడీ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. లిక్కర్ పాలసీకి సంబంధించి హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సౌత్ గ్రూపుకు చెందినవారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ స్కాంలో అనిల్ వ్యవహారంపై కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. కవిత నివాసంలో జరిగిన సమావేశంలో రామచంద్రన్ పిళ్లై, బోయిన్ పల్లి అభిషేక్, శరత్ చంద్రారెడ్డి పాల్గొనగా.. అనిల్ కూడా ఆ భేటీలో ఉన్నట్లు ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. దీంతో కవిత భర్త అనిల్ కూడా ఈ కేసులో చిక్కుకున్నట్లైంది. త్వరలో ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. ఆ రోజు సమావేశంలో అసలు ఏం మాట్లాడుకున్నారు? పాలసీ రూపకల్పనలో ఏం జరిగింది? అనే వివరాలను అనిల్ ద్వారా తెలుసుకునేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు.

Related Articles