కళాతపస్వి సతీమణి జయలక్ష్మి కన్నుమూత

దివంగత లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో జయలక్ష్మి తుదిశ్వాస విడిచారు. కే విశ్వనాథ్‌ భౌతికంగా అందరినీ విడిచి నెల కూడా గడవక ముందే ఆయన సతీమణి కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కే విశ్వనాథ్ 21వ ఏట జయలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. విశ్వనాథ్‌-జయలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. కాగా వీరిలో ఒకరు అమ్మాయి కాగా.. ఇద్దరు అబ్బాయిలు. జయలక్ష్మి మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Related Articles