తీహార్‌ జైలుకు మనీశ్‌ సిసోడియా

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆప్‌ నేత సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాలతో ఆయన్ను తీహార్‌ జైలుకు తరలించారు. సిసోడియా వారం రోజులుగా సీబీఐ కస్టడీలో ఉన్నారు. గడువు ముగియడంతో సోమవారం ఆయన్ను కోర్టులో హాజరుపర్చారు. కాగా, సిసోడియా తనతో పాటు జైలుకు మందులు, కళ్లద్దాలు, డైరీ, పెన్ను, భగవద్గీతను తీసుకెళ్లడానికి జడ్జి అనుమతి ఇచ్చారు. ఈడీ కేసులో అరెస్టైన మరో ఆప్‌ నేత సత్యేంద్ర జైన్‌తో పాటు లిక్కర్‌ స్కాంలో అరెస్టైన ఏడుగురు నిందితులు కూడా ప్రస్తుతం తీహార్‌ జైలులోనే ఉన్నారు.

Related Articles