ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్

దేశంలో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ చోటుచేసుకుంది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేసింది. ఇదిలా ఉంటే అరుణ్ రామచంద్ర పిళ్లైని ఇటీవలే రెండు రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వాళ్ల సంఖ్య 11కి చేరింది. ఇదిలా ఉంటే.. గతంలోనే ఈ స్కాంలో ఆయన్ని నిందితుడిగా చేర్చిన ఈడీ.. ఆయన ఇంట్లో సోదాలు కూడా నిర్వహించింది. ఆయనకు సంబంధించిన కోట్ల రూపాయల ఆస్తులను సైతం జప్తు చేసింది.

Related Articles