ఓటీటీలోకి ‘పఠాన్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన తాజా చిత్రం ‘పఠాన్‌’. ఇటీవల హాట్‌ టాపిక్‌గా మారి ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాన్‌ అబ్రహం కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాబట్టింది. తొలిరోజే అనుకుంటే వరుసగా ఆరు రోజులు వంద కోట్ల గ్రాస్‌కు దిగకుండా కలెక్షన్‌లు రాబడుతూ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌కు ఊపిరిపోసింది. షారుఖ్‌ఖాన్‌ యాక్షన్‌, దీపికా అందాలు, జాన్‌ అబ్రహం విలనిజం ప్రేక్షకులను థియేటర్‌లకు రిపీటెడ్‌గా వచ్చేలా చేశాయి. కాగా తాజాగా ఈ సినిమా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డు నెలకొల్పింది. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమాగా సంచలనం సృష్టించింది. కాగా, ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈసినిమా ఏప్రిల్‌ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

Related Articles