భువనగిరి ఎంపీ కోమటిరెడ్డిపై కేసు

భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను చంపేందుకు తన అనుచరులు తిరుగుతున్నారని, అంతేగాక సుధాకర్‌ ఆసుపత్రిని కూల్చివేస్తారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం తనకు ఫోన్‌ చేసి బెదిరించారని చెరుకు సుధాకర్‌ తనయుడు చెరుకు సుహాస్‌ సోమవారం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అవరసమైతే తనను కూడా చంపుతారని కోమటిరెడ్డి హెచ్చరించినట్టు సుహాస్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపిన పోలీసులు కోమటిరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Related Articles