వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్..

వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. నేడు సమావేశం ఏర్పాటు చేసి పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. లోక్‌నాథ్ రెడ్డితో పాటూ పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దమందడి సర్పంచ్‌ వెంకటస్వామి సాగర్‌ ఇదే బాటలో నడుస్తున్నారు. వీరి వెంట మాజీ జడ్పీటీసీ సభ్యుడు రమేశ్‌ గౌడ్‌, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు సత్యారెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, సింగిల్‌విండో అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు పార్టీ బీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి తీరుతో లోక్‌నాథ్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీరు బీఎర్‌ఎస్‌కు రాజీనామా చేస్తామని ప్రకటించినా.. తమ పదవులకు రాజీనామాపై స్పష్టత ఇవ్వలేదు.

Related Articles