బీఆర్‌ఎస్‌లోకి విజయవాడ మాజీ మేయర్‌

విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల భారత్‌ రాష్ట్ర సమితి కండువా కప్పుకున్నారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో తాడి శకుంతలతోపాటు మహిళా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మాల్యాద్రితో పాటూ పలువురు మైనారిటీ నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన తాడి శకుంతల గతంలో విజయవాడ మేయర్‌గా పనిచేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది మేయర్‌గా సేవలందించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌‌లో కొనసాగిన ఆమె టీడీపీ గూటికి చేరారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Related Articles