కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దేవనకొండ మండలం పి.కోటకొండలో పట్టపగలే హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే అల్లుడు సూర్యప్రకాశ్ను మామ లింగమయ్య కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. ఘటనా స్థలంలోనే కుప్పకూలిన సూర్యప్రకాశ్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అల్లుడిపై కక్ష పెంచుకున్న లింగమయ్య.. జాతరలో పాల్గొన్న అల్లుడిని హత్య చేయాలని భావించాడు. పథకం ప్రకారం కత్తులు సిద్ధం చేసుకుని దాడి చేశాడు. గ్రామంలో జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేశారు.. అయినా హత్య జరగడం కలకలం రేపింది.