బాలాపూర్‎లో బాలుడి కిడ్నాప్..హత్య..!

హైదరాబాద్‌ బాలాపూర్‎లో బాలుడి కిడ్నాప్‌ కేసు కలకలం రేపుతోంది. ఈనెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఫైజల్‌ అనే బాలుడు.. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అర్థరాత్రి దాటినా బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు దగ్గర్లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు చేసిన దర్యాప్తులో శనివారం రాత్రి బాలుడు ఫైజల్‌ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి హత్యకు జాఫర్ అనే వ్యక్తితో గొడవలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి హత్యపై పోలీసులు కిడ్నాప్‌, మర్డర్‌ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles