శరత్‌ను అరెస్ట్‌ చేసిందెవరు?

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు త‌న‌యుడు శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రశ్నించారు. ”సైకో జ‌గ‌న్ తాడేప‌ల్లి ముఠానా? టెర్ర‌రిస్టుని అరెస్టు చేసిన‌ట్టు ఎందుకు ర‌హ‌స్యంగా ఉంచుతున్నారు? శ‌ర‌త్‌కి ఏమైనా హాని త‌ల‌పెట్టారా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ఈ అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాన’ని ఆయన ట్వీట్‌ చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఎన్నిక‌ల్లో వైకాపాకు ఓట‌మి త‌ప్పద‌ని, బ‌ల‌మైన టిడిపి నేత‌లే ల‌క్ష్యంగా సైకో జ‌గ‌న్ ప‌న్నుతున్న కుతంత్రాల‌ను తిప్పికొడ‌తామని ఆయన స్పష్టం చేశారు. శ‌ర‌త్‌ని త‌క్షణ‌మే విడుద‌ల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త‌ప్పుడు కేసులు, అక్రమ అరెస్టుల‌పై న్యాయ‌పోరాటం చేస్తామని, జ‌గ‌న్ దిగిపోయే ముందైనా ఇటువంటి సైకో చేష్టలు ఆప‌క‌పోతే, చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుందని నారా లోకేష్‌ హెచ్చరించారు.

Related Articles