పోలీసుల అదుపులో ప్రత్తిపాటి కొడుకు

విజయవాడ పోలీసులు టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీ అధికారుల ఫిర్యాదు మేరకు శరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. శరత్‌ను టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు సమాచారం. మనీలాండరింగ్‌కు పాల్పడటంతో పాటు పన్ను ఎగవేశారన్న అభియోగాల కింద శరత్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరత్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.

Related Articles